హైదరాబాద్ : హైదరాబాద్ మియాపూర్లోని ఆదిత్య నగర్లో దారుణం జరిగింది. పట్టపగలే ఓ యువకుడు తన ప్రియురాలు, ఆమె తల్లిపై విచక్షణారహితంగా దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం ఆ యువకుడు తన గొంతు కోసుకున్నాడు. యువకుడు సందీప్కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల్లీకూతుళ్లను కూడా సమీప ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.