నెల్లూరు : నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఘోరం జరిగింది. కాలేజీమిట్టలో చెంచు కృష్ణ అనే యువకుడు.. జ్యోతి (18) గొంతు కోశాడు. ప్రేమించడం లేదనే కోపంతో..కాలేజీకి వచ్చిన అమ్మాయిపై దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జ్యోతి ఇంటర్మీడియట్ చదువుతోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.