సికింద్రాబాద్ : పరిచయమైన ఆంటీ మాట్లాడటం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం బల్కంపేటకు చెందిన పి. దుర్గేష్ (31) గత రెండు సంవత్సరాలుగా ఓల్డ్ బోయిన్పల్లిలోని మైత్రీవనం రాంరెడ్డి కాలనీ లోని ఓ ఇంటిలో ఉంటూ ఎలక్ట్రిషన్గా పనిచేస్తున్నాడు.
ఆ సమయంలో అదే ఇంటికి సంబంధించిన ఆంటీతో పరిచయం ఏర్పడింది. సదరు ఆంటీ తరచూ దుర్గేష్తో మాట్లాడుతూ ఉండేది. వారి ఇంటిలో ఏసీకి సంబంధించిన పనితో పాటు ఇతర ఎలక్టికల్కు సంబంధించి ఏ పనికైనా దుర్గేష్నే పిలిపించి పని చేయించుకునేవారు. ఈ క్రమంలో తరచూ దుర్గేష్ వచ్చి వెళ్తూవుండేవాడు.
ఉన్నట్లుండి గత కొన్నిరోజులుగా ఆ ఆంటీ దుర్గేష్తో మాట్లాడటం మానేసింది. పలుమార్లు ప్రయత్నించిన తాను మాట్లాడక పోవడంతో మనస్థాపం చెందిన దుర్గేష్ గురువారం సదరు మహిళ ఇంటికి వెళ్లి మొదటి అంతస్థులోని వారి బెడ్ రూమ్లోకి వెళ్లి తలుపులు పెట్టుకుని ఫ్యాన్కు తన చొక్కాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
దుర్గేష్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.