Karimnagar | కరీంనగర్ : కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఏడాది వయసున్న కుమారుడికి విషమిచ్చి, తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బొమ్మకల్కు చెందిన శ్రీజకు సాఫ్ట్వేర్ ఇంజినీర్తో కొన్నేండ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాలతో రెండు రోజుల క్రితమే శ్రీజ తన కుమారుడితో కలిసి పుట్టింటికి వచ్చింది. ఇక ఇవాళ తన కుమారుడికి విషమిచ్చి, తానూ ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు కూడా చనిపోయాడు. కుమార్తె శ్రీజ ఆత్మహత్య వార్త తెలిసి ఆమె తల్లి జయప్రద కూడా విషం తాగింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శ్రీజ కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.