హైదరాబాద్ : ఓ వివాహిత తన ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తోంది. ఇదే సమయంలో ఆమె భర్త జవాన్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటన హైదరాబాద్లోని రహమత్ నగర్లో గురువారం ఉదయం వెలుగు చూసింది.
రహమత్ నగర్ పరిధిలోని యాదగిరినగర్లో ఉండే ఓ మహిళకు మధుసూదన్ అనే జవాన్తో వివాహమైంది. అయితే గురువారం ఉదయం జవాన్ ఇంటికి వచ్చి చూడగా, భార్య ప్రియుడితో ఏకాంతంగా ఉన్న విషయాన్ని గ్రహించాడు. దీంతో ఇంటికి తాళం వేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రియుడినే భర్తగా పరిచయం చేసి ఇల్లును కిరాయికి తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.