అహ్మదాబాద్ : గుజరాత్ రాజధాని గాంధీ నగర్ కేంద్రంగా కొనసాగుతోన్న ఇంటర్నేషనల్ చైల్డ్ పోర్నోగ్రఫీ రాకెట్ను జామ్నగర్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
డీఎస్పీ జయవీర్ సింహ్ జాలా కథనం ప్రకారం.. ఇంటర్నేషనల్ చైల్డ్ పోర్నోగ్రఫీ రాకెట్ను సైబర్ క్రైమ్ పోలీసులు చేధించారని తెలిపారు. ఓ వాట్సాప్ లింక్ను సైబర్ క్రైమ్ పోలీసులు క్లిక్ చేయగా, ఈ ఘోరం వెలుగు చూసిందన్నారు. ఐపీ అడ్రస్ ద్వారా విశ్లేషించగా, గాంధీనగర్ జిల్లా కేంద్రంగా ఈ దందా కొనసాగుతోన్నట్లు తేలిందన్నారు.
వీడియోలను అప్లోడ్ చేస్తున్న కిషన్ను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 600 ఫోటోలు, 224 వీడియోలను అతన్ని నుంచి స్వాధీనం చేసుకున్నారు. హార్డ్ డిస్కులో ఉన్న మరో 1600 వీడియో క్లిప్స్ను డిలీట్ చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో రష్యా, ఫ్రాన్స్కు చెందిన దేశాల వారు అధికంగా ఉన్నట్లు తేలిందన్నారు. అయితే ఈ పిల్లల ఫోటోలను ఎక్కడ్నుంచి తీసుకున్నారనే అంశంపై పోలీసులు విచారణ కొనసాగుతోంది.