హైదరాబాద్ : అమ్మాయి కోసం ఆన్లైన్లో వెతికిన ఒక ఐటీ ఉద్యోగి సైబర్ నేరగాళ్ళకు అడ్డంగా దొరికిపోయాడు. రూ. 1.97 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వెలుగు చూసింది.
పోలీసుల కథనం ప్రకారం…చందానగర్కు చెందిన ఒక ఐటీ ఉద్యోగి గత నెలలో ఆన్లైన్లో కాల్గర్ల్ ఎస్కార్ట్ సర్వీస్ కోసం సెర్చ్ చేశాడు. ఈ క్రమంలో ఒక లింక్ను క్లిక్ చేయగా ఓ వాట్సాప్ నంబర్ లభించింది. పటేల్ చార్మి పేరుతో పరిచయమైన వ్యక్తి.. ఐటీ ఉద్యోగికి కొంత మంది అమ్మాయిల ఫొటోలను షేర్ చేశాడు. తొలుత బుకింగ్ కోసమని రూ. 510 వసూలు చేశాడు. తరువాత రూ.5,500, ఆ వెంటనే సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో మరో రూ. 7,800 చొప్పున పలు దఫాలుగా రూ.1.97 లక్షల సొమ్మును ఐటీ ఉద్యోగి వద్ద నుంచి సైబర్ నేరగాడు కాజేశాడు. వివిధ కారణాలతో డబ్బులు తీసుకుంటున్న వ్యక్తి ఎంతకీ తనకు కావాల్సిన్ కాల్ గర్ల్ ను ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. దీంతో బాధిత ఐటీ ఉద్యోగి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.