ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నార్నూర్ మండలం నాగల్కొండలో ఓ యువతి వేరే మతానికి చెందిన యువకుడిని గత కొంతకాలంగా ప్రేమిస్తోంది. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమించొద్దని, విరమించుకోవాలని యువతికి తల్లిదండ్రులు సూచించారు.
కానీ ఆమె తన ప్రేమను కొనసాగించింది. దీంతో ఆమెను తల్లిదండ్రులే హత్య చేశారు. కుమార్తె గొంతును కత్తితో కోసేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని రాజేశ్వరి(20)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.