రంగారెడ్డి : జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్మెట్లో ఘోరం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి పాదాచారులపై దూసుకెళ్లింది. ఓ బుల్లెట్ బైక్ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుల్లెట్పై ఉన్న విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుడిని సిరిసిల్ల ప్రగతి నగర్కు చెందిన పీ ప్రణయ్ గౌడ్గా గుర్తించారు. బ్రేకులు ఫెయిల్ కావడంతోనే లారీ అదుపు తప్పినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.