హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ నూతన చైర్మన్, సభ్యులు రేపు(శుక్రవారం) బాధ్యతలు స్వీకరించనున్నారు. రేపు ఉదయం 10.45 గంటలకు చైర్మన్ బి.జనార్దన్రెడ్డితో పాటు ఏడుగురు సభ్యులు కారం రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, రిటైర్డ్ ఈ ఎన్సీ రమావత్ ధన్ సింగ్, సీబీఐటీ ప్రొఫెసర్ బీ లింగారెడ్డి, ఎస్డీసీ కోట్ల అరుణ కుమారి, ఆచార్య సుమిత్రా ఆనంద్ తనోబా, ఆయుర్వేద వైద్యులు అరవెల్లి చంద్ర శేఖర్ రావు బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో పాటు ఏడుగురు సభ్యులను నియమిస్తూ బుధవారం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం.. సీఎం ప్రతిపాదనకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.