బంజారాహిల్స్ : భార్యను నిత్యం వేధింపులకు గురిచేస్తుండడంతో పాటు దాడికి పాల్పడిన భర్త బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్ సమీపంలోని పారామౌంట్ కాలనీలో నివాసం ఉంటున్న సొహైల్ అహ్మద్, నవీనాకు 1995లో వివాహం కాగా వారికి ఇద్దరు పిల్లలున్నారు.
గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్యగొడవలు జరుగుతున్నాయి. తనకు డబ్బులు కావాలంటూ సొహైల్ (50) తరచూ భార్యతో గొడవపడుతుంటాడు. ఈ నేపథ్యంలో ఈనెల 1న ఇద్దరి మధ్య గొడవ జరగడంతో భార్యపై కర్రతో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమెకు తీవ్రగాయలయ్యాయి.
ఆస్పత్రిలో చికిత్స అనంతరం శుక్రవారం డిశ్చార్జ్ అయిన నవీనా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు సొహైల్ అహ్మద్ఫై ఐపీసీ 324, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.