జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని బీర్పూర్లో దారుణం జరిగింది. వ్యవసాయ పొలం వద్ద ఉన్న వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు. మృతుడిని నర్సయ్య(70)గా పోలీసులు గుర్తించారు. గత రెండు రోజుల నుంచి నర్సయ్య కనిపించకుండా పోయాడు. బంధువుల ఇంటికి వెళ్లి ఉండొచ్చని భావించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
ఇవాళ ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా నర్సయ్య మృతదేహం కనిపించింది. నర్సయ్య గొంతు కోసి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.