రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. ఓ కారులో తరలిస్తున్న రూ. 64 లక్షల 63 వేల నగదును పోలీసులు సీజ్ చేశారు. కారులో భారీగా నగదు తరలిస్తున్నట్లు ఎస్వోటీ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు నిఘా ఉంచి, నగదు తరలిస్తున్న కారును గుర్తించి, ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ డబ్బును ఎక్కడ్నుంచి ఎక్కిడికి తరలిస్తున్నారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నగదుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.