భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలి జిల్లాలో దారుణం జరిగింది. ఓ 60 ఏండ్ల వృద్ధురాలి ఐదుగురు వ్యక్తులు కలిసి సామూహిక అత్యాచారానికి ( Molestation ) పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలు తన సోదరితో కలిసి ఇంటికి వెళ్తుండగా.. విద్యానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని జయంత్ చౌక్ రైల్వే ట్రాక్ దగ్గర ఐదుగురు వ్యక్తులు అడ్డగించారు.
అప్పటికే పూటుగా మద్యం సేవించి ఉన్న ఐదుగురు వ్యక్తులు బాధితురాలిని పక్కకు లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి పారిపోయారు. కానీ, బాధితురాలు పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేశారు. పారిపోయిన నిందితులను వెతికి పట్టుకున్నారు. కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు చెప్పారు.