యాదాద్రి భువనగిరి : హైదరాబాద్ – విజయవాడ రహదారి రక్తసిక్తమైంది. వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దివీస్ ల్యాబ్ సమీపంలో బైక్, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇదే ఘటనాస్థలి వద్ద బైక్ను లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు యువకులు హెల్మెట్ ధరించలేదు అని పోలీసులు తెలిపారు.
చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద మరో ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు – కారు ఢీకొని ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇద్దరు మృతులను హైదరాబాద్కు చెందిన చందు(35), పృథ్వీరాజ్(23)గా పోలీసులు గుర్తించారు. ఈ వేర్వేరు ప్రమాద ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.