యాదాద్రి భువనగిరి : స్థిరాస్తి వెంచర్లలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జనగామ జిల్లాకు చెందిన ఈ ఐదుగురిని బీబీనగర్ మండలం గూడూరు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్థిరాస్తి వెంచర్లలో విద్యుత్ తీగలను చోరీ చేసి.. వాటిని విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల నుంచి రూ. 8.25 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఐదు మండలాల్లో ఏడు కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. చోరీ చేసిన విద్యుత్ తీగలను హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.