బెంగళూరు: సోదరితో వివాహేతర సంబంధం కలిగిన ఒక యువకుడ్ని నలుగురు వ్యక్తులు హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి లొంగిపోయారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. మునిరాజా అనే వ్యక్తి సోదరి భర్తను వీడి 15 రోజులుగా తల్లి ఇంట్లో ఉంటున్నది. వస్త్ర దుకాణంలో ఆమెతో పాటు పని చేసే భాస్కర్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయంపై శనివారం సాయంత్రం ఆ మహిళను తల్లి నిలదీయగా ఇంట్లో గొడవ జరిగింది. దీంతో ఆమె భాస్కర్కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది.
వెంటనే ఆ మహిళ ఇంటికి వెళ్లిన భాస్కర్, ఆమెతో పాటు చిన్న పిల్నాడ్ని తన వెంట ఆటోలో తీసుకెళ్లాడు. వారితో వెళ్లేందుకు నిరాకరించిన ఆమె పెద్ద కుమారుడు ఈ విషయాన్ని మేనమామ మునిరాజ్కు చెప్పాడు. దీంతో మునిరాజ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి భాస్కర్ ఆటోను అడ్డగించాడు. సోదరి, చిన్న కుమారుడ్ని ఇంటికి పంపారు. భాస్కర్ను బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకుని కెబ్బేహల్లాలోని నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. రెండు గంటలపాటు అతడ్ని చావకొట్టారు.
భాస్కర్ అపస్మారక స్థితిలో ఉన్నట్లుగా నటిస్తున్నాడని తొలుత భావించారు. అయితే అతడు మరణించినట్లు గ్రహించారు. మునిరాజ్ ఈ విషయాన్ని తన తల్లికి చెప్పాడు. ఆమె సూచన మేరకు భాస్కర్ మృతదేహాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. దీంతో భాస్కర్ హత్యపై మునిరాజ్తో పాటు అతడికి సహకరించిన ముగ్గురు స్నేహితులు మారుతి, నగేష్, ప్రశాంత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.