చెన్నై: విమానాశ్రయాల్లో భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. ఎయిర్పోర్టు లోపలికి అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి కదలికలను భద్రతాధికారులు గమనిస్తుంటారు. ప్రయాణికులకు సంబంధించిన డాక్యుమెంట్లను, లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంటారు. అందుకే తరచూ తప్పుడు పత్రాలతో ప్రయాణించేవారు.. బంగారం, ఇతర వస్తువులను అక్రమంగా రవాణాచేసే వారు పట్టుబడుతుంటారు. బంగారం స్మగ్లర్లయితే ( Gold smugling ) నిత్యం ఎక్కడో ఒకచోట పట్టుబడుతూనే ఉన్నారు.
తాజాగా చెన్నై అంతర్జాతీయ విమనాశ్రయంలో ముగ్గురు బంగారం స్మగ్లర్లు పట్టుబడ్డారు. బంగారం పేస్ట్ను ట్యూబ్లలో నింపి, పాయురంధ్రాల్లో పెట్టుకుని వచ్చిన ముగ్గురిని ఎయిర్పోర్టులోని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి నాలుగు బండిళ్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అందులో మూడు బంగారు ముద్దలు ఉన్నాయి. ఆ బంగారం మొత్తం బరువు 952 గ్రాములు ఉన్నదని, దాని విలువ రూ.37.88 వేలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.