హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం పట్టుబడింది. ఇవాళ ఉదయం హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయగా.. ఓ మహిళ ప్రయాణికురాలి నుంచి 282 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 14.68 లక్షలు ఉంటుందని తెలిపారు. దుబాయి నుంచి వచ్చిన మహిళ ప్రయాణికురాలు బంగారాన్ని తన మలద్వారంలో దాచి ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.