జోగులాంబ గద్వాల : గద్వాలోని నల్లకుంట కాలనీలో భారీ చోరీ జరిగింది. బషీర్ అనే ఉద్యోగి ఇంట్లో సోమవారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. 25 తులాల బంగారం, 60 తులాల వెండి, రూ. 2 లక్షల నగదును దొంగలు అపహరించారు. బాధితుడు బషీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గద్వాల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన నివాసాన్ని పోలీసులు పరిశీలించారు. డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు.