జోగులాంబ గద్వాల : అలంపూర్ చౌరస్తాలో 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి బైక్పై కర్నూల్ వైపు ప్రయాణిస్తున్నాడు. ఉత్తర ఫుడ్స్ వద్దకు రాగానే వారి బైక్ను వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తండ్రికి తీవ్ర గాయాలు కాగా, ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన చిన్నారులను చెన్నిపాడుకు చెందిన రిషి, నిశితగా పోలీసులు గుర్తించారు. చిన్నారుల ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.