బెంగళూర్ : బర్త్డేకు కొత్త డ్రస్ కొనేందుకు తల్లితండ్రులు నిరాకరించడంతో మనస్ధాపానికి లోనైన బాలిక(16) సీలింగ్కు ఉరివేసుకుని మరణించిన ఘటన నగరంలోని హెబ్బల్ సమీపంలోని సహకారనగర్లో వెలుగుచూసింది. పనికి వెళ్లి ఆదివారం సాయంత్రం ఇంటికి తిరిగివచ్చిన తల్లితండ్రులకు బాలిక విగతజీవిగా కనిపించచడంతో విషాదంలో మునిగిపోయారు. తల్లితండ్రులు ఎంతసేపటికీ తలుపు కొట్టినా తెరవకపోవడం, ఫోన్ కాల్స్కు బదులివ్వక పోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా బాలిక బెడ్రూమ్లో సీలింగ్కు వేలాడుతూ కనిపించింది.
బాలిక పదో తరగతి పరీక్షల్లో ఫెయిలవడంతో ఇంటి దగ్గరే ఉంటోందని తల్లితండ్రులు పోలీసులకు వివరించారు. బాలిక తన బర్త్డే సందర్భంగా కొత్త డ్రస్ కొనివ్వాలని కోరగా లాక్డౌన్తో ఆర్ధిక ఇబ్బందుల కారణంగా వారు అందుకు నిరాకరించారని కుటుంబ సభ్యలు తెలిపారు. మరోవైపు బాలిక తమ దూరపు బంధువైన ఓ యువకుడిని ఇష్టపడి అతడితో పెండ్లి జరిపించాలని కోరగా అందుకు ఇరు కుటుంబాల వారు అంగీకరించలేదని, దీంతో కూడా బాలిక తీవ్ర మనోవేదనకు గురైందని తెలిసింది.