జోగులాంబ గద్వాల : గద్వాల పట్టణంలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. రాజ వీధిలో ఉన్న గాయత్రి జ్యువెలరీ దుకాణంలోకి చొరబడ్డ దొంగలు.. బంగారాన్ని దోచుకెళ్లారు. దీంతో దుకాణ యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. షాపు వద్దకు చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దుకాణంలో ఉన్న 15 తులాల బంగారం, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడ్డ నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.