Chitradurga | కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాలలో జరిగే నాటక ప్రదర్శన కోసం సిద్ధమవుతున్న ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
సంజయ్ గౌడ్ (12) అనే విద్యార్థి స్థానిక ఎస్ఎల్వీ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. కాగా, పాఠశాలలో త్వరలో ఫ్రీడం ఫైటర్ భగత్ సింగ్ నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ఇందులో సంజయ్.. భగత్ సింగ్ పాత్ర పోషించనున్నాడు. ఇందు కోసం తన ఇంట్లో రిహార్సల్స్ మొదలు పెట్టాడు. ఈ క్రమంలో నాటకంలో భాగంగా ఉరి వేసుకునే సీన్ను ప్రాక్ట్రీస్ చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకున్నట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.