Road Accident | ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జలాలాబాద్ ప్రాంతంలోని బరేలీ-ఫరూఖాబాద్ హైవేపై ట్రక్కు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది మృతి దుర్మరణం చెందారు. గంగలో స్నానం చేసి పంచాల్ ఘాట్కు వెళ్తున్న సమయంలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి సహా తల్లి కొడులు ఉన్నారు. ట్రక్కు ఆటోను వేగంగా ఢీకొట్టడంతో మృతదేహాలన్ని రోడ్డుపై 20 మీటర్ల వరకు చెల్లాచెదురుగా పడిపోయాయి.
సంఘటనా స్థలమంతా రక్తంతో నిండిపోయింది. పుష్కమాసం పౌర్ణమి సందర్భంగాలో స్సానం చేసేందుకు మదానాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని దామగడ గ్రామస్తులు ఆటోను మాట్లాడుకున్నారు. గురువారం ఉదయం అందరూ గంగాస్నానం చేసేందుకు ఫరూఖాబాద్లోని పంచల్ఘాట్కు ఆటోలో బయలుదేరారు. ఉదయం సమయంలో దట్టంగా పొగమంచు కమ్మేసింది.
అల్హాగంజ్లోని సుగుసుగి గ్రామ సమీపంలోని హైవేపై ఎదురుగా ఆటోకు ఎదురుగా వచ్చి ట్రకు ఢీకొట్టింది. లారీ వేగంగా ఉండడంతో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదం తర్వాత సైతం లారీ డ్రైవర్ ఆటోను ఢీకొట్టుకుంటూనే రోడ్డుపై పడిపోయిన వారి పైనుంచి వెళ్లినట్లు తెలుస్తున్నది. ఈ ప్రమాదం ఘటనాస్థలిని స్థానికులందరినీ షాక్కు గురి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. డ్రైవర్ లారీని జలాలాబాద్లో వదిలేసి పరారయ్యాడు. పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.