ముంబై: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు సరఫరా అయిన డ్రగ్స్ను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నట్లు ముంబై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) వెల్లడించింది. జలగావ్ జిల్లాకు ఈ డ్రగ్స్ వెళ్తున్నాయని, మార్గమధ్యంలో నాందేడ్ వద్ద అధికారులు ఈ డ్రగ్స్ సరఫరాను అడ్డుకున్నారని ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే వెల్లడించారు.
‘ముంబై ఎన్సీబీ అధికారులు 1127 కేజీల డ్రగ్స్ను సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ డ్రగ్స్ తీసుకొచ్చారు. ఇప్పటికి ఇద్దరినీ అరెస్టు చేశాం. వారిని కోర్టు ముందు హాజరుపరుస్తాం. దర్యాప్తు కొనసాగుతోంది’ అని సమీర్ వాంఖడే తెలిపారు. ఈ కేసు విచారణ తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు.