హైదరాబాద్ : నగరంలోని రాజేంద్ర నగర్ పరిధిలో దారుణం జరిగింది. స్నేహం చాటున ఓ యువకుడు పదో తరగతి విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్కు చెందిన ఓ అమ్మాయి తన తల్లిదండ్రుల వద్ద కలిసి ఉంటోంది. ఆమెకు స్థానికంగా ఉండే ఓ యువకుడు ఏడాది క్రితం పరిచయం అయ్యాడు. అప్పట్నుంచి ఇద్దరూ స్నేహంగా ఉంటున్నారు. ఇటీవల ఆ యువతికి మాయమాటలు చెప్పి.. బైక్పై హిమాయత్ సాగర్ వైపు తీసుకెళ్లాడు.
అక్కడ విద్యార్థినిపై యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెప్తే.. నీతో పాటు నీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు భయపడి ఇంట్లో చెప్పలేదు. నాలుగైదు రోజుల నుంచి ఆమెకు అతన్నుంచి వేధింపులు అధికమవడంతో.. చేసేదేమీ లేక జరిగిన ఘోరాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబ సభ్యులు రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.