వెంగళరావునగర్ : గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అమ్మతున్న ఓ రౌడీషీటర్ను ఎస్.ఆర్.నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ అంజయ్యనగర్కు చెందిన పఠాన్ అలీఖాన్ అలియాస్ అలీభాయ్ (50) గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.
దీంతో పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అతని పై నిఘా పెట్టి ఏజీ కాలనీ కూడలి వద్ద అలీఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద జేబులో నుంచి 10 గ్రాముల చొప్పున 20 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అతని ద్వీచక్ర వాహనం డిక్కీలో నుంచి కిలో బరువున్న గంజాయి లభ్యమయింది.
నిందితుడిని తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎస్.ఆర్.నగర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.