బంట్వారం : పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మ చేసుకున్న సంఘటన బంట్వారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రొంపల్లి గ్రామానికి చెందిన కురువ నర్సింహులు (34) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సమస్యలతో సతమమతవుతు, మనస్థాపానికి గురై ఆదివారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లి అక్కడ పురుగుల మంది తాగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో కుటుంబ సభ్యులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.