జైపూర్ : జైపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామంలో అమానుషం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 18 ఏండ్ల మానసిక దివ్యాంగుడిపై లైంగికదాడి జరిగినట్లు జైపూర్ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరుగగా ఆలస్యంగా శనివారం బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఇందారం గ్రామానికి చెందిన కుర్మిండ్ల రవి, పొలవేని సురేశ్, మహమ్మద్ సాదీక్, గడ్డం నందు, బోగే రాయలింగులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
గత కొంతకాలంగా దివ్యాంగుడిపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు కుటుంబసబ్యులు తెలిపారు. అనారోగ్యానికి గురైన కుమారుడిని గమనించిన తల్లితండ్రులు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు వారు విజ్ఞప్తి చేశారు.