కావలసిన పదార్థాలు
రాగిపిండి: ఒక కప్పు, గోధుమపిండి: అర కప్పు, బియ్యపుపిండి: పావు కప్పు, తరిగిన ఉల్లిగడ్డ, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ ముక్కలు: టేబుల్ స్పూన్ చొప్పున, పచ్చిమిర్చి: నాలుగు, ఉప్పు: తగినంత, నూనె: కొద్దిగా, కొత్తిమీర తురుము: కొద్దిగా.
తయారీ విధానం
ఒక గిన్నెలో అన్ని పిండి రకాలు, కూరగాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి, తగినన్ని నీళ్లుపోసి దోశపిండిలా జారుగా కలుపుకోవాలి. స్టవ్మీద పాన్పెట్టి, ఒక టీస్పూన్ నూనె వేయాలి. బాగా వేడయ్యాక పిండి మిశ్రమాన్ని కాస్త మందంగా వేయాలి. రెండు వైపులా నూనెవేసి కాల్చుకుని.. పైనుంచి కొత్తిమీర తురుము చల్లుకుంటే వేడివేడి రాగి వెజ్ పాన్కేక్ సిద్ధం.