కావలసిన పదార్థాలు
పైనాపిల్ ముక్కలు: ఒక కప్పు, పండు మిర్చి: నాలుగు, పచ్చి రొయ్యలు: అర కప్పు, కొబ్బరిపాలు: రెండు కప్పులు, తాటి బెల్లం: పావు కప్పు, ఎండు రొయ్యలు: ఒక టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు: ఒక టేబుల్ స్పూన్, సెజువాన్ సాస్: రెండు టేబుల్ స్పూన్లు, కరివేపాకు: రెండు రెబ్బలు, నిమ్మరసం: రెండు టీస్పూన్లు, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
ఎండు రొయ్యలను మిక్సీలో వేసి పొడి చెయ్యాలి. స్టవ్మీద పాన్ పెట్టి అర కప్పు కొబ్బరిపాలు పోసి.. బాగా వేడయ్యాక సెజువాన్ సాస్, ఎండు రొయ్యల పొడి జోడించి సన్నని మంటపై దగ్గర పడేవరకూ ఉడికించాలి. ఆ తర్వాత మిగతా కొబ్బరి పాలు, పైనాపిల్ ముక్కలు, పచ్చి రొయ్యలు, తాటి బెల్లం, ఉప్పు, చింతపండు గుజ్జు, నిమ్మరసం వేసి సన్నని మంటపై పావు గంటపాటు ఉడికించాలి. చివరగా కరివేపాకు, సన్నగా తరిగిన పండు మిర్చి వేసుకుంటే నోరూరించే పైనాపిల్ థాయ్ కర్రీ సిద్ధం.