కావలసిన పదార్థాలు
బియ్యం: ఒక కప్పు, బెల్లం తురుము: ముప్పావు కప్పు, పాలు: రెండు కప్పులు, నెయ్యి: పావు కప్పు, డ్రైఫ్రూట్స్: పావు కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్.
తయారీ విధానం
బియ్యాన్ని బాగా కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో అరకప్పు నీళ్లుపోసి, బెల్లం వేసి కరిగేలా కలపాలి. స్టవ్మీద గిన్నెపెట్టి పాలు పోసి వేడయ్యాక బియ్యం వేసి బాగా ఉడికించాలి. అన్నం మెత్తగా ఉడికిన తర్వాత.. కరిగించిన బెల్లం, యాలకుల పొడి జోడించి సన్నని మంటపై మరో అయిదు నిమిషాలు ఉడికించాలి. స్టవ్మీద పాన్పెట్టి నెయ్యి వేడయ్యాక, అందులో డ్రైఫ్రూట్స్ వేయించాలి. వీటిని నెయ్యితోపాటు ఉడుకుతున్న అన్నంలో కలిపితే ఘుమఘుమలాడే బెల్లం పరమాన్నం సిద్ధం.