పనీర్ తురుము: ఒక కప్పు, ఆలుగడ్డ: ఒకటి (పెద్దది), ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, క్యారెట్ తురుము: ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా, కారం: ఒక టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, ఆమ్చూర్: అర టీస్పూన్, అల్లం: అంగుళం ముక్క, ఉప్పు: తగినంత, మిరియాల పొడి: పావు టీస్పూన్, కార్న్ఫ్లోర్: అర కప్పు, మైదా: రెండు టేబుల్ స్పూన్లు, బ్రెడ్ క్రంబ్స్: అర కప్పు, నూనె: వేయించడానికి సరిపడా, వాము: కొద్దిగా.
తయారీ విధానం
ఒక గిన్నెలో పనీర్ తురుము, ఉడికించి మెదిపిన ఆలుగడ్డ ముద్ద, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్, కొత్తిమీర తురుము, కారం, గరం మసాలా, ఆమ్చూర్, అల్లం తురుము, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి బాగా కలిపి నీళ్లు పోయ కుండా ముద్దలా చేయాలి. స్టవ్మీద కడాయి పెట్టి సరిపడా నూనె పోసి, వేడి చేయాలి. ఒక గిన్నెలో మైదా, కార్న్ఫ్లోర్, వాము, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుగా కలపాలి. పనీర్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని అరచేత్తో టిక్కీల్లా ఒత్తుకుని ముందుగా మైదా మిశ్రమంలో ముంచి, బ్రెడ్ క్రంబ్స్లో దొర్లించాలి. వీటిని దోరగా కాల్చుకుంటే వేడివేడి పనీర్ టిక్కీలు సిద్ధం.