కావలసిన పదార్థాలు :
ఫూల్ మఖానా (తామర గింజలు): ఒక కప్పు, పాలు: 2 కప్పులు, జీడిపప్పు, బాదం, కిస్మిస్:10 చొప్పున, నెయ్యి: నాలుగు స్పూన్లు, పంచదార: ఆరు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి: కొద్దిగా, కుంకుమపువ్వు: చిటికెడు.
తయారీ విధానం:
రెండు స్పూన్ల నెయ్యి కడాయిలో వేసుకుని అందులో ఫూల్మఖానా, జీడిపప్పు, సగానికి తరిగిన బాదం పప్పు వేసి సన్నటి సెగమీద బాగా వేయించాలి. మఖానా కరకరలాడేలా అయ్యాక స్టవ్ ఆపి పక్కకు పెట్టుకోవాలి. బాదం, జీడి పప్పు గోధుమ వన్నె వచ్చేలా వేయించుకోవాలి. వేయించిన మఖానాలో ఒకవంతు పక్కకు పెట్టుకుని, రెండు వంతుల్ని మిక్సీపట్టి పొడి చేసుకోవాలి. తర్వాత, ఒక మందపాటి గిన్నెలో రెండుకప్పుల పాలు పోసి మీడియం మంట మీద కాగనివ్వాలి. అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. పాలు మరిగాక పంచదార వేయాలి. తర్వాత ఫూల్ మఖానా పొడితో పాటు వేయించిన మఖానా గింజల్నీ జోడించాలి. పది నిమిషాల తర్వాత యాలకుల పొడి కలిపి, బాదం, జీడి పప్పు, కిస్మిస్ జోడించాలి. కాస్త నెయ్యి వేసి, చివరగా కుంకుమ పువ్వు చల్లి దించుకోవాలి. వేడిగా వడ్డించినా, ఫ్రిజ్లో పెట్టి చల్లచల్లగా తిన్నా కమ్మగా ఉంటుంది మఖానా ఖీర్.