కావలసిన పదార్థాలు:
జొన్నపిండి: ఒక కప్పు, పెసరపిండి: ఒక కప్పు, నువ్వులు: ఒక టేబుల్ స్పూన్, నెయ్యి: పావు కప్పు, ఉప్పు: తగినంత, వాము: అర టీ స్పూన్
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో జొన్నపిండి, పెసరపిండి వేసి నువ్వులు, ఉప్పు, వాము కలపాలి. నెయ్యిని కాస్త గోరువెచ్చగా చేసి, పిండి మిశ్రమంలో వేసి బాగా కలిపి, తగినన్ని నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు, పిండిముద్దను చిన్నచిన్న ముద్దలుగా చేసి చెక్కలు ఒత్తుకుని నూనెలో దోరగా కాల్చుకోవాలి. కరకరలాడే ఈ జొన్న పెసర చెక్కలను
ఒవెన్లోనూ బేక్ చేసుకోవచ్చు.