కావలసిన పదార్థాలు
గుమ్మడికాయ ముక్కలు: ఒక కప్పు, మైదాపిండి: మూడు కప్పులు, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా.
తయారీ విధానం:
ముందుగా గుమ్మడికాయ ముక్కల్ని ఉడికించి, మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. మైదాపిండిలో ఒక టేబుల్ స్పూన్ నూనె, తగినంత ఉప్పు, గుమ్మడికాయ గుజ్జు, కొద్దిగా వేడినీళ్లు పోసి బాగా కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. బాగా నానిన పిండిని ఉండలుగా చేసుకొని పరాటాల్లా ఒత్తుకోవాలి.