పెసరపప్పు: ఒక కప్పు, అల్లం: రెండంగుళాల ముక్క, పచ్చిమిర్చి: ఐదు, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కొద్దిగా, నూనె: కొద్దిగా.
పెసరపప్పును బాగా కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. మిక్సీజార్లో తరిగిన అల్లం, పచ్చిమిర్చి, నానిన పెసరపప్పు వేసి కొద్దికొద్దిగా నీళ్లుపోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము వేసి కలుపుకోవాలి. స్టవ్మీద పెనంపెట్టి, బాగా వేడయ్యాక పప్పు మిశ్రమాన్ని దోశలా వేసుకుని చుట్టూ నూనె వేస్తూ కాల్చుకుంటే మూంగ్దాల్ చిల్లా రెడీ.