పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం రాధే శ్యామ్. యూవీ క్రియేషన్ బ్యానర్పై వంశీ – ప్రమోద్ – ప్రసీద నిర్మిస్తున్న ఈ చిత్రం 2022, సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కాగా, ఇది ప్రేక్షకులని ఎంతగానో అలరించడమే కాక యూట్యూబ్లో దూసుకుపోతుంది.
ఈ టీజర్ విడుదలైనప్పటి నుండి భారీ స్థాయి రెస్పాన్స్ ను అందుకొని టాలీవుడ్ హైయెస్ట్ వ్యూడ్ టీజర్ గా రికార్డు సెట్ చేసింది. అయితే 63మిలియన్ వ్యూస్ ఒక్క సారిగా 62 మిలియన్స్కి వచ్చాయి. ఇలా తగ్గడంపై అభిమానులు యూట్యూబ్ని ప్రశ్నించగా, క్లారిటీ ఇచ్చారు. కొన్ని సార్లు యూట్యూబ్ వ్యూస్ కౌంట్ అప్డేట్ చెయ్యడం అనేది స్లో గా జరుగుతుంది అని అలాగే కొన్ని సందర్భాల్లో ఆలస్యం కూడా అవ్వొచ్చని అన్నారు.
యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ తెరకెక్కించిన పీరియాడిక్ లవ్ స్టోరీ ఇప్పటికే టాకీ పార్ట్ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈమూవీ ప్రమోషన్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిజినెస్ వ్యవహారాలు కూడా మొదలయ్యాయట. ఆర్డి ఇల్యూమినేషన్ తాజాగా ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ను భారీ ధరకు సొంతం చేసుకుంది.