యంగ్ హీరోయిన్ అనన్య పాండే వర్క్ షెడ్యూల్ నుంచి కాస్త విరామం తీసుకుంటున్నది. ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి ‘లైగర్’ చిత్రంలో నటించిన ఆమె షూటింగ్తో పాటు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపింది. ఇక ఇప్పుడు టైమ్ దొరకగానే ఆమె ఫేవరేట్ హాలీడే స్పాట్ ఇటలీ చేరుకుంది. అక్కడ బోటు షికారు చేస్తూ గుహల్లో విహరిస్తున్నది. అక్కడ హృదయాకారపు శిలల్లో ప్రేమను అనుభూతి చెందుతున్నది.
ఇటలీ టూర్ సంగతులన్నీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్న అన న్య..బోటులో షికారు చేస్తూ హృతిక్ రోషన్ నటించిన ‘జిందగీ నా మిలేగీ దొబారా’ చిత్రం నుంచి సూరజ్ కి బాహూమేం పాటను ఆస్వాదిస్తున్నట్లు ఇన్స్టాలో పోస్టు చేసింది.
అనన్య పోస్టుకు ఆమె స్నేహితురాలు షారుఖ్ ఖాన్ కూతురు సుహానా స్పందిస్తూ…‘ఇటలీ టూర్లో నీ పోస్టులు చూస్తుంటే నేనూ నీతో కలిసి అక్కడ ఉన్నట్లుంది’అని పేర్కొంది. చుంకీ పాండే కూతురిగా పరిశ్రమకు వచ్చింది అనన్య. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’తో తెరకు పరిచయమైంది. ప్రస్తుతం ఆమె ‘ఖో గయే హమ్ కహాన్’ సినిమాలో నటిస్తున్నది.