అగ్ర దర్శకుడు సుకుమార్ స్వీయ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్పై వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పలు అగ్ర నిర్మాణ సంస్థలతో కలిసి పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్నదీ సంస్థ. తాజాగా ఈ బ్యానర్లో దర్శకుడు వి.యశస్వి ఓ సినిమా చేయబోతున్నాడు.
ఆయన దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘సిద్ధ్దార్థ్రాయ్’ త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా మేకింగ్లో యశస్వి ప్రతిభకు మెచ్చిన సుకుమార్ తన బ్యానర్లో తదుపరి చిత్రాన్ని చేసే అవకాశాన్నిచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.