Yatra 2 | ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (Cm Jagan) జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా వచ్చిన తాజా చిత్రం యాత్ర 2 (Yatra 2). 2019లో వచ్చిన యాత్ర (Yatra) సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రం వచ్చింది. ఈ సినిమాలో వైఎస్. రాజశేఖర్రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటించగా.. సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యాక్టర్ జీవా (Jeeva) నటించాడు. మహి వి రాఘవ్ (Mahi V Raghav) దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం తాజాగా ఫిబ్రవరి 08న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా చూసిన అభిమానులు చాలా క్లీన్గా ఉందని జగన్ పాత్రలో జీవా జీవించేశాడని చెబుతున్నారు.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ యాత్ర 2 మేకింగ్ వీడియో విడుదల చేశారు. మేకింగ్ అఫ్ యాత్ర 2 (Making of yatra 2) పేరిట ఈ వీడియో విడుదల చేయగా.. ఈ వీడియోలో జగన్ పాత్రలో జీవాని సెలక్ట్ చేయడం దగ్గరనుంచి షూటింగ్ ముగింపు వరకు యాత్ర 2 ను తీర్చిదిద్దడంలో టీమ్ చేసిన హార్డ్ వర్క్ కనిపిస్తుంది. ఇక సినిమాలో హైలైట్గా నిలిచిన పలు సన్నివేశాలను ఈ వీడియోలో చూడవచ్చు.