‘కేజీఎఫ్’ సిరీస్లో వచ్చిన రెండు చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నారు కన్నడ హీరో యష్. ‘కేజీఎఫ్-2’ విడుదలై ఏడాది గడచినా ఇప్పటివరకు యష్ తదుపరి సినిమా ప్రకటన రాలేదు. దాంతో ఆయన తర్వాతి ప్రాజెక్ట్ గురించి అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతున్నది. తాజా సమాచారం ప్రకారం కన్నడ దర్శకురాలు గీతూ మోహన్దాస్ నిర్దేశకత్వంలో యష్ తన తదుపరి చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.
మూతోన్, కేల్కున్నుడో వంటి చిత్రాలతో ప్రతిభావంతురాలైన దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది గీతూ మోహన్దాస్. ఆమె చెప్పిన యాక్షన్ థ్రిల్లర్ కథాంశం యష్కు నచ్చడంతో ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నదని కన్నడ సినీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో ఈ సినిమా అధికారిక ప్రకటన రానుంది.