సుహాస్, టీనా శిల్పరాజ్ జంటగా నటించిన సినిమా ‘రైటర్ పద్మభూషణ్’. ఈ చిత్రాన్ని ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ పతాకాలపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించారు. షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలపై దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ మాట్లాడుతూ…‘షార్ట్ ఫిలింస్ చేస్తున్నప్పటి నుంచే సుహాస్తో పరిచయం ఉంది. అతను నటించిన కలర్ ఫొటో చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశాను. అలా మాకున్న స్నేహంతో ఈ కథ చెప్పాను. సుహాస్కు బాగా నచ్చి మూవీ స్టార్ట్ చేశాం. ఒక కుటుంబ కథా చిత్రమిది. ప్రతి పాత్ర తెరపై సందడి చేస్తుంది. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. హీరో ఒక లైబ్రేరియన్. పుస్తకాలపై ఇష్టంతో తాను కూడా ఓ బుక్ రాస్తాడు. రైటర్ కావాలనుకుంటాడు. అతను కోరుకున్నది సాధించాడా? లేదా? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటూనే సస్పెన్స్ థ్రిల్లర్ కథ కూడా రన్ అవుతుంది. జంధ్యాల, ఈవీవీ, శ్రీనువైట్ల వంటి దర్శకుల సినిమాలను ఇష్టపడతాను. నా రచనలోనూ వారి స్ఫూర్తి ఉంది. అలాంటి హ్యూమర్ ఉన్న సినిమాలను మనమంతా ఆస్వాదిస్తాం. త్వరలో కొత్త సినిమా ప్రకటిస్తా’ అని చెప్పారు.