మిట్టకంటి రామ్, విజయ్ శంకర్, దీక్ష, మహి మల్హోత్రా, కిస్లే ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 2020 గోల్ మాల్. కెకె చైతన్య సమర్పణలో బాబీ ఫిలింస్ పతాకంపై కెకె చైతన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 18న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఆడియో విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. పల్లెటూరి నేపథ్యంగా సాగే చిత్రమిది. సస్పెన్స్ కామెడీ డ్రామాగా తెరకెక్కించాం, 70,80ల నాటి రెట్రో లుక్ తో ప్రధాన పాత్రలు ఆకట్టుకుంటారని తెలిపారు దర్శకుడు. ఈ చిత్రానికి సంగీతం- కనిష్క, సినిమాటోగ్రఫీ – జగన్.