సండే రోజు నాగార్జున నీలాంబరి సాంగ్తో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. సండేను ఫండేగా మార్చడానికి హౌజ్మేట్స్కి పలు టాస్క్లు ఇచ్చారు నాగార్జున. హౌస్మేట్స్తో ‘బొమ్మ ఇక్కడ, పాట ఎక్కడ?’ అనే గేమ్ ఆడించాడు. అందులో భాగంగా ఇంటిసభ్యులను రెండు టీములుగా విభజించాడు. ఏ టీమ్లో సన్నీ, విశ్వ, షణ్ముఖ్, కాజల్, ప్రియాంక ఉండగా మిగిలిన వారంతా బీ టీమ్లో ఉన్నారు. ఈ గేమ్ రూల్ ఏంటంటే హీరో హీరోయిన్ల బొమ్మలను గుర్తు పట్టి, వారి కాస్ట్యూమ్ ఆధారంగా అది ఏ పాట అయి ఉంటుందో గెస్ చేయాలని అన్నాడు.
ముందుగా రవి, విశ్వ రాగా వారిలో రవి అల వైకుంఠపురములోంచి రాములో రాముల పాటను ఈజీగా గెస్ చేశాడు. తర్వాత సిరి, షణ్ముఖ్ రాగా, షణ్ముఖ్ రాగా.. గంట కొట్టిన షణ్ను టెంపర్లోని పాటను సరిగ్గా గెస్ చేయలేకపోయాడు. దీంతో షన్ను టీం మైనస్ పాయింట్లోకి వెళ్లిపోయింది. అనంతరం మానస్, సన్నీలు వచ్చారు. వారికి గబ్బర్ సింగ్ నుంచి పిల్లా నువ్వులేని జీవితం అనే పాటకు సంబంధించిన బొమ్మలు వచ్చాయి. దానిని మానస్ సరిగ్గానే గెస్ చేశాడు.
కాజల్, శ్రీరామచంద్ర లకి ఖైదీ నంబర్ 150 నుంచి సుందరి అనే పాట ఇవ్వగా, శ్రీరామ్చంద్రర అది గెస్ చేశాడు. అలా రవి టీంకు మళ్లీ ఓ పాయింట్ వచ్చింది. ఆ తరువాత ఆనీ, ప్రియాంకలు వచ్చారు.. శ్రీమంతుడు నుంచి దిమ్మతిరిగే దిమ్మా తిరిగే అనే పాటకు సంబంధించిన బొమ్మలు వచ్చాయి. వాటిని ప్రియాంక గెస్ చేసింది.దీంతో సన్నీ టీం మైనస్ నుండి జీరోకి వచ్చింది. నాగార్జున నటించిన ఢమరుకం పాటని ఎవరు గుర్తు పట్టలేకపోయారు. కాజల్ సిరి వచ్చినప్పుడు కాజల్ చెప్పకముందే సాహో పాట అని బయటి నుంచి ప్రియాంక చెప్పింది. దీంతో షన్ను టీం డిస్ క్వాలిఫై అయింది. అలా రవి టీం గెలిచింది.