Sai Dharam Tej | ఈ ఏడాది విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్తో కలిసి బ్రో సినిమాలో కూడా మెరిశాడు. ఈ మూవీ కూడా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించడమే కాదు.. సాయిధరమ్ తేజ్కు మరో హిట్టు ఖాతాలో వేసింది. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్.. 9 ఏండ్లు విజయవంతంగా కెరీర్ను పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ట్విట్టర్లో అభిమానులు, మూవీ లవర్స్తో ASK SDT సెషన్లో పాల్గొన్నాడు.
మీ అంకుల్ పవన్ కల్యాణ్తో నటించారు.. మరి మరో అంకుల్ చిరంజీవితో ఎప్పుడు పనిచేస్తారని ఈ సందర్భంగా ఓ నెటిజన్ సాయిధరమ్ తేజ్ను అడిగారు. దీనిపై సాయిధరమ్ తేజ్ స్పందిస్తూ.. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని.. తనకు మాస్ సినిమాలంటే చాలా ఇష్టమన్నాడు. ఏ సినిమాలు ఎక్కువగా సంతృప్తినిచ్చాయని అడిగితే.. చిత్రలహరి, రిపబ్లిక్ సినిమాలని చెప్పాడు.
అన్ని రకాల సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ ప్రశ్నోత్తరాల సెషన్లో ఒక అభిమాని ఇక నుంచి ప్రమాదకర స్టంట్స్ చేయడం మానుకోవాలని, మీరు అభిమానులకు చాలా విలువైనవారని విజ్ఞప్తి చేయడం విశేషం. సాయి ధరమ్ తేజ్ నెక్ట్స్ సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో రూపొందుతున్న గంజా శంకర్లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్-ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఎస్ నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
గంజా శంకర్ First High..