శివ మనసులో శృతి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కోలీవుడ్ భామ రెజీనా కసాండ్రా (Regina Cassandra). తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతోపాటు వెబ్ సిరీస్లు కూడా చేస్తూ బిజీగా ఉంది. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్పెషల్ సాంగ్లో కూడా మెరిసింది. ప్రస్తుతం షూర్వీర్ (Shoorveer), ఫర్జీ (Farzi) వెబ్ సిరీస్లో కూడా నటిస్తోంది. రెజీనా లీడ్ రోల్లో నటించిన అన్యస్ ట్యుటోరియల్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ బ్యూటీ తాజాగా అలీతో సరదాగా (Ali)టెలివిజన్ టాక్ షోలో సందడి చేసింది.
2019 కులూమనాలీ (Kullu Manali room) రూం నంబర్ నాకు తెలియదు..అందులో ఒకటి జరిగింది..ఏంటది అని రెజీనాను అడిగారు అలీ. దానికి రెజీనా స్పందిస్తూ..నా లైఫ్లో ఇంకా ఇలాంటివి జరుగుతాయి అనుకుంటున్నా..తాను ఐ మాస్క్ పెట్టుకుని పడుకున్నపుడు సడెన్గా ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టింది రెజీనా. అయితే ఆ విషయం ఏంటనేది ప్రోమోలో సస్పెన్స్ పెట్టాడు అలీ.
ఇప్పటిదాకా పనిచేసిన డైరెక్టర్లలో.. ది బెస్ట్ డైరెక్టర్లలో 1,2,3 నంబర్స్ ఎవరికిస్తారని అడిగారు అలీ. వారెవరో చెప్పేందుకు రెజీనా తడబడుతుంటే..ఆ డైరెక్టర్లు ఎవరనేది తానే చెప్తానంటున్నాడు అలీ. ఇంతకీ వాళ్లెవరనేది త్వరలో తెలియనుంది. చిన్నపుడు స్కూల్లో క్లాస్ లీడర్గా ఉంటే అబ్బాయిల్ని ఎందుకుకొట్టాల్సి వచ్చిందో అని అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చింది రెజీనా. తన జర్నీకి సంబంధించి షేర్ చేసుకున్న విశేషాలు త్వరలోనే పూర్తి ఎపిసోడ్లో తెలియనున్నాయి.
ప్రస్తుతం రెజీనా తెలుగు, తమిళంలో చేస్తున్న నేనే నా చిత్రం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు తెలుగులో శాకినీ ఢాకినీ సినిమా చేస్తోంది. వీటితోపాటు కోలీవుడ్ లో మరో మూడు చిత్రాలు రెజీనా ఖాతాలో ఉన్నాయి.