తెలంగాణ నేపథ్య కుటుంబ కథ ‘ఇడుపు కాయితం’ టైటిల్పై సోషల్మీడియాలో మొదలైన వివాదంపై చిత్ర నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథను బట్టే టైటిల్ ఉంటుందని, ప్రస్తుత వివాదం నేపథ్యంలో టైటిల్ను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏ సినిమాకైనా కథను బట్టే టైటిల్ను నిర్ణయిస్తారని, ఇది ఒక ప్రాంతానికి పరిమితమయ్యే కథ కాదని, దర్శకుడు తాను చూసిన వాస్తవ సంఘటనల స్ఫూర్తితో కథ రాసుకున్నాడని బన్నీ వాసు అన్నారు. సోషల్మీడియాలో పోస్ట్లు పెట్టేముందు జాగ్రత్తగా ఉండాలని, విభేదాలు తీసుకురాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా సినిమా ప్రారంభమైంది.