ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలోని సంఘటనల ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ తెరకెక్కించిన చిత్రం ‘వ్యూహం’. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. వై.యస్.జగన్ పాత్రలో అజ్మల్ నటించారు. నవంబర్ 10న ఈ చిత్రం విడుదలకానుంది. శుక్రవారం ట్రైలర్ను ఆవిష్కరించారు.
రామ్గోపాల్వర్మ మాట్లాడుతూ ‘ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు దాని వెనక ఎన్నో పరిణామాలు చోటుచేసుకుంటాయి. అవన్నీ బయటి ప్రపంచానికి తెలియవు. అలాంటి విషయాలను ఈ సినిమాలో చూపించాను. నేను సేకరించిన సమాచారాన్ని ప్రేక్షకులకు నచ్చే సినిమాటిక్ ఫార్మాట్లో తెరకెక్కించాను’ అని చెప్పారు. జగన్ రాజకీయ జీవితంలోని ఆసక్తికరమైన సంఘటనలను తీసుకొని ఈ సినిమా చేశామని నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమాతో పాటు తాను ‘శపథం’ అనే మరో చిత్రాన్ని తెరకెక్కించానని, జనవరి 25న విడుదలవుతుందని రామ్గోపాల్వర్మ తెలిపారు.